రాబోయే తరాలకు చాలా అవసరమైన సినిమా ఇది: Kriti Sanon

by Disha Web Desk 10 |
రాబోయే తరాలకు చాలా అవసరమైన సినిమా ఇది: Kriti Sanon
X

దిశ, సినిమా: ‘ఆదిపురుష్’ సినిమా రాబోయే తరాలకు చాలా ప్రత్యేకమైనదంటోంది కృతిసనన్. ప్రభాస్ సరసన ఆమె నటించిన ఈ మూవీ జూన్ 16న విడుదల కాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి.. ఇంత గొప్ప ప్రాజెక్టులో భాగమైనందుకు హ్యాపీగా ఉందని చెప్పింది. ‘ఇది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. పాత తరం వాళ్లే కాదు రాబోయే తరం పిల్లలు తప్పక చూడాల్సిన చిత్రమిది. రామాయణం, మహా భారతం వంటి కథల ప్రాధాన్యత ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. విజులవ్ వండర్ త్రీడీలోనూ గొప్ప అనుభూతి పొందుతారు. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఇప్పటికే ట్రైలర్‌కు వచ్చిన స్పందన మమ్మల్ని ఆశ్చర్యపరిస్తే.. ‘జై శ్రీరామ్’ పాట జనాల హృదయాలను హత్తుకుని మారుమోగుతోంది. సినిమా చూసేందుకు అభిమానులతోపాటు నేను ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అంటూ మూవీపై ప్రశంసలు కురిపించింది.

Read More... పెళ్లైన వ్యక్తితో ప్రేమాయణం ఏంటి.. సంయుక్త ఎఫైర్‌పై మండిపడుతున్న నెటిజన్లు..!

Next Story